News October 25, 2024
INDvsNZ: గిల్ ఔట్
గాయం కారణంగా న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఆడలేకపోయిన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 72 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో LBW రూపంలో పెవిలియన్ చేరారు. భారత్ ప్రస్తుతం 50/2గా ఉంది. క్రీజులో జైస్వాల్(20), కోహ్లీ(0) క్రీజులో ఉన్నారు. KL.రాహుల్ స్థానంలో గిల్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News October 25, 2024
మాయదారి ‘మయోనైజ్’ మాయం?
షవర్మా, మండి బిర్యానీ వంటి ఆహారాల్లో వాడే మయోనైజ్ నిషేధానికి TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో అనారోగ్యానికి గురవుతున్నట్లు GHMCకి ఫిర్యాదులు రావడంతో బ్యాన్కు అనుమతించాలని ప్రభుత్వానికి బల్దియా లేఖ రాసింది. దీన్ని పరిశీలిస్తున్న సర్కార్ రాష్ట్రమంతా బ్యాన్ చేయొచ్చని సమాచారం. గుడ్డు సొన, నూనె, నిమ్మరసం, ఉప్పుతో వండకుండా చేసే ఈ పదార్థంలో హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. మీరూ దీని బాధితులేనా?
News October 25, 2024
అందుకే ఐదేళ్లు మౌనంగా ఉన్నా: షర్మిల
AP:ఆస్తి కోసం తాను, అమ్మ అత్యాశ పడుతున్నామని YS అభిమానులు భావించవద్దని షర్మిల కోరారు. ‘ఆస్తుల విభజన ఒప్పందం ఐదేళ్లు నా చేతుల్లో ఉన్నా ఏనాడూ బయటికి చెప్పలేదు. ఒక్క ఆస్తి ఇవ్వకపోయినా, ఆర్థిక ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం కోసం బయటపెట్టలేదు. తాజాగా ఇవన్నీ బయటకు వచ్చాయంటే NCLTలో కేసు వేసి సొంత అమ్మకే బతుకుపై అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు’ అని పేర్కొన్నారు.
News October 25, 2024
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకి దించి తనిఖీలు చేస్తున్నారు. ఆ విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.