News October 25, 2024
బలంగా ప్రతిస్పందిస్తాం: మోర్నే మోర్కెల్

న్యూజిలాండ్తో రెండో టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా ప్రస్తుతానికి వెనుకబడినా మళ్లీ పుంజుకుంటుందని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం బౌలర్లు శ్రమించి న్యూజిలాండ్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయాలి. అక్కడక్కడా మేం తడబడ్డాం. కానీ ఈ బృందం పోరాటాన్ని ఆపదు. ప్రతి అవకాశాన్నీ ఒడిసిపట్టి తిరిగి పుంజుకుంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 18, 2025
NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.
News March 18, 2025
రేపు తెలంగాణ బడ్జెట్

TG: అసెంబ్లీ కమిటీ హాల్లో రేపు ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఉ.11.14 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో, మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కీలక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది.
News March 18, 2025
పెద్ద దేవళాపురం@42.7 డిగ్రీలు

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉలిందకొండలో 42.6, ఖాజీపేటలో 41.8, దరిమడుగులో 41.5, నాగసముద్రం, వత్తలూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే నమోదవడం గమనార్హం. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 42 మండలాల్లో వడగాలులు వీచాయని APSDMA వెల్లడించింది.