News October 26, 2024
ALTT ఓటీటీపై ఫిర్యాదులు
ALTT ఓటీటీపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు సమాచార మాజీ కమిషనర్ ఉదయ్ మహుర్కర్ ఆధ్వర్యంలోని సేవ్ కల్చర్-సేవ్ భారత్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసింది. సదరు OTT అసభ్యకర కంటెంట్ను అందుబాటులోకి తెచ్చి పోక్సో, ఐటీ చట్టాల్ని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక-అసభ్యకరమైన కంటెంట్ అందుబాటులో ఉండడమే దేశంలో అత్యాచారాలకు ప్రధాన కారణమని ఉదయ్ పేర్కొన్నారు.
Similar News
News October 27, 2024
రాజా సాబ్ను ఢీకొట్టనున్న థగ్ లైఫ్?
రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ప్రభాస్లాంటి మాస్ హీరో సినిమా వస్తోందంటే ఆ డేట్కి వేరే సినిమా రిలీజెస్ సాధారణంగా ఉండవు. కానీ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మూవీని అదే డేట్కు తీసుకురావాలని భావిస్తున్నట్లు కోలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చెబుతున్నాయి. రాజాసాబ్తో తమిళనాట తమకు ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నట్లు సమాచారం.
News October 27, 2024
దక్షిణ కొరియాకు ‘ఒంటరి మరణాల’ సమస్య
దక్షిణ కొరియాలో భారీగా పెరుగుతున్న ‘ఒంటరి మరణాలు’ ఆ ప్రభుత్వానికి ఆందోళనను కలిగిస్తున్నాయి. ఒంటరితనంతో బాధపడుతున్న వేలాదిమంది నడి వయసు పురుషులు తమవారికి తెలియకుండా ఒంటరిగా మరణిస్తున్నారు. ఈ తరహా మరణాలు గత ఏడాది 3661 నమోదయ్యాయి. ఈ సమస్యని చక్కదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో 327 మిలియన్ డాలర్ల విలువైన చర్యలు తీసుకోవాలని సియోల్ నిర్ణయించింది. ఇప్పటికే పౌరులకోసం 24 గంటల హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది.
News October 27, 2024
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు
*దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు
*ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇళ్లు
*పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణం
*గచ్చిబౌలి స్టేడియాన్ని స్పోర్ట్స్ వర్సిటీకి వాడాలని నిర్ణయం
*6వేలకు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు
*ఉస్మానియా ఆస్పత్రికి గోషామహల్లో స్థలం కేటాయింపు