News October 26, 2024
ALTT ఓటీటీపై ఫిర్యాదులు

ALTT ఓటీటీపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు సమాచార మాజీ కమిషనర్ ఉదయ్ మహుర్కర్ ఆధ్వర్యంలోని సేవ్ కల్చర్-సేవ్ భారత్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసింది. సదరు OTT అసభ్యకర కంటెంట్ను అందుబాటులోకి తెచ్చి పోక్సో, ఐటీ చట్టాల్ని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక-అసభ్యకరమైన కంటెంట్ అందుబాటులో ఉండడమే దేశంలో అత్యాచారాలకు ప్రధాన కారణమని ఉదయ్ పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
శుభ సమయం (06-07-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు
News July 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.