News October 27, 2024

2035 కల్లా భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్: కేంద్రమంత్రి

image

‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ పేరిట ఇండియా అంతరిక్ష కేంద్రాన్ని తయారుచేయనుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. స్పేస్ టెక్నాలజీతో బయోటెక్నాలజీని సమీకృతం చేసేలా ఆ శాఖతో ఇస్రో ఒప్పందం చేసుకుంది. 2035కల్లా భారత్‌కు స్పేస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి తెలిపారు. కాగా.. అమెరికాకు ఇప్పటికే స్పేస్ స్టేషన్ ఉంది. చైనా తన సొంత స్టేషన్‌ను నిర్మిస్తోంది.

Similar News

News November 5, 2025

వరి మాగాణుల్లో నువ్వులు, ఆవాలు ఎప్పుడు చల్లుకోవాలి?

image

రాయలసీమ జిల్లాల్లో నల్లరేగడి నేలల్లో వరి కోసే 10 రోజులకు ముందు ఆవాలు, నువ్వుల విత్తనాలను పొలంలో వెదజల్లాలి. ఆవాలు ఎకరాకు 1 నుంచి 1.5కిలోలు, నువ్వులు ఎకరాకు 1.5 నుంచి 2 కిలోలు అవసరం. ఆవాల విత్తనాలను 5-6 కిలోల సన్నని ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా వెదజల్లాలి. ఆ సమయంలో బురద పదునులో విత్తనాలు వారంలో మొలకెత్తుతాయి. నువ్వుల విత్తనాలను 1.5kg బియ్యపు నూకలతో కలిపిచల్లితే సమానంగా పొలంలో పడతాయి.

News November 5, 2025

కాసేపట్లో వర్షం..

image

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.

News November 5, 2025

10ఏళ్లలో 10 మంది కబడ్డీ ప్లేయర్ల హత్య

image

పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SMలో పోస్టు చేసింది. ‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, క్రైమ్‌తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.