News October 27, 2024

2035 కల్లా భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్: కేంద్రమంత్రి

image

‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ పేరిట ఇండియా అంతరిక్ష కేంద్రాన్ని తయారుచేయనుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. స్పేస్ టెక్నాలజీతో బయోటెక్నాలజీని సమీకృతం చేసేలా ఆ శాఖతో ఇస్రో ఒప్పందం చేసుకుంది. 2035కల్లా భారత్‌కు స్పేస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి తెలిపారు. కాగా.. అమెరికాకు ఇప్పటికే స్పేస్ స్టేషన్ ఉంది. చైనా తన సొంత స్టేషన్‌ను నిర్మిస్తోంది.

Similar News

News July 10, 2025

విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

image

AP: లిక్కర్‌ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విజయసాయి ఒకసారి విచారణకు హాజరయ్యారు.

News July 10, 2025

కష్టపడుతున్న భారత బౌలర్లు

image

భారత్‌తో మూడో టెస్టులో ఫస్ట్ సెషన్‌లో కాస్త తడబడ్డ ఇంగ్లండ్ రెండో సెషన్‌లో ఆధిపత్యం చెలాయించింది. టీ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్లకు 153 రన్స్ చేసింది. రూట్ 54*, పోప్ 44* రన్స్‌తో క్రీజులో నిలదొక్కుకున్నారు. 44 రన్స్‌కే ఇద్దరు ఇంగ్లిష్ బ్యాటర్ల వికెట్లు తీసిన నితీశ్ భారత్‌కు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే మిగతా బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ ప్రభావం చూపలేకపోయారు.

News July 10, 2025

తొలి క్వార్టర్‌: TCS‌కు రూ.12,760 కోట్ల లాభం

image

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో భారత టెక్ దిగ్గజం TCS రూ.12,760 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. గతేడాది ఇదే పీరియడ్‌(రూ.12,040 కోట్లు)తో పోలిస్తే లాభం 6 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం రూ.62,613 కోట్ల నుంచి రూ.63,437 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0.30% పెరిగి 24.5%కు ఎగిసింది. కాగా ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ డిక్లేర్ చేసింది.