News October 27, 2024
రేణూ దేశాయ్కి ఉపాసన సాయం!

నటి రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను రెస్క్యూ చేయడమే ఈ సంస్థ పని. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన స్పందించినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం రైమ్ పేరిట ఆమె ఈ సాయం చేశారట. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం వ్యాన్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమ్, ఉపాసన’ అంటూ రేణూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
Similar News
News March 18, 2026
ఎస్సీ యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద మంజూరైన 540 యూనిట్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. రూ.5.16 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ సెట్లు, ఉపాధి శిక్షణ అందించనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులు మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఏప్రిల్ నాటికి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేశారు.
News March 18, 2026
ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.
News March 18, 2026
ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.


