News October 27, 2024
సీనియర్లకు షాకిచ్చిన గంభీర్!
న్యూజిలాండ్ చేతిలో ఘోర <<14459559>>ఓటమితో <<>>భారత కోచ్ గంభీర్ కఠిన చర్యలకు దిగినట్లు సమాచారం. ఇంతకాలం సీనియర్లకున్న ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ అవకాశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి స్టార్లకు గతంలో ఇది ఆప్షనల్గా ఉండేది. ఇకపై ప్రతి ఒక్క ప్లేయర్ పక్కాగా హాజరుకావాలని మేనేజ్మెంట్ స్పష్టం చేసినట్లు సమాచారం. NOV 1 నుంచి 3వ టెస్ట్ ప్రారంభం కానుండగా, OCT 30-31 వరకు ట్రైనింగ్ నిర్వహించనుంది.
Similar News
News October 27, 2024
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. UPDATE
TG: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో రైడ్ చేశామని FIRలో తెలిపారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తేలిందని, మిగతా వారు టెస్టులకు సహకరించలేదని చెప్పారు. రాజ్ సూచించడంతోనే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు విజయ్ చెబుతున్నారని పేర్కొన్నారు.
News October 27, 2024
ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోన్న కాంగ్రెస్: కిషన్ రెడ్డి
TG: కాంగ్రెస్ను నమ్మి అన్ని వర్గాలు మోసపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ఆరు గ్యారంటీలు, 400 హామీలను ఎలా అమలు చేస్తుంది? పెన్షన్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి గురించి సర్కార్ ఆలోచించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మూసీ బాధితుల కోసం కరసేవ చేసేందుకు మేం సిద్ధం’ అని ఆయన ప్రకటించారు.
News October 27, 2024
దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే!
ఇండియాలో 2024కి గాను అత్యుత్తమ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ SBIని బెస్ట్ బ్యాంకుగా ఎంపిక చేసింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ సేవలు, ఖాతాదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఎస్బీఐ ముందంజలో ఉందని ఆ మ్యాగజైన్ తెలిపింది. మన దేశంలో SBIకి 22500 బ్రాంచులు, 62వేల ఏటీఎంలు ఉన్నాయి.