News October 28, 2024

కరెంట్ ఛార్జీలు పెరుగుతాయా?

image

TG: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల మేర కరెంట్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కంలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఒకవేళ దీనికి ఈఆర్సీ అనుమతిస్తే నవంబర్ 1 నుంచి ప్రజలపై(300యూనిట్లకు పైగా వాడేవారు) ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీల భారం పడే అవకాశం ఉంది.

Similar News

News October 28, 2024

పార్టీలపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం

image

TG: వందల మంది వచ్చి మద్యం తాగాల్సిన పరిస్థితుల్లో ఎక్సైజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒకరిద్దరి విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి మద్యపాన నిషేధం లేదని, దావత్‌లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News October 28, 2024

ఓబీసీలను మోదీ వంచించారు: కాంగ్రెస్

image

కుల‌గ‌ణ‌న‌కు అంగీక‌రించ‌కుండా OBCల‌ను ప్ర‌ధాని మోదీ వంచించార‌ని కాంగ్రెస్ విమ‌ర్శించింది. వ‌చ్చే ఏడాది జ‌న‌గ‌ణ‌న‌కు సిద్ధ‌మైన కేంద్రం కుల‌గ‌ణ‌నను విస్మ‌రించ‌డాన్ని ప్ర‌ధాన విప‌క్షం త‌ప్పుబ‌ట్టింది. ఈ విష‌యంలో NDA ప్ర‌భుత్వాన్ని ఆపుతున్న‌దేంట‌ని ప్ర‌శ్నించింది. మోదీ త‌న రాజ‌కీయ అహంకారంతో కుల‌గ‌ణ‌నను ప‌క్క‌న‌పెట్టార‌ంది. దీనిపై NDA మిత్ర‌ప‌క్షాలైన JDU, TDPల వైఖ‌రేంటో చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

News October 28, 2024

చైతూ-శోభితపై కామెంట్స్ చేసిన వేణుస్వామికి షాక్

image

నాగచైతన్య – శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామికి TG హైకోర్టు షాక్ ఇచ్చింది. వారంలోగా ఈ కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు హాజరుకావాలని గతంలో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈక్రమంలో ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది.