News November 2, 2024
BREAKING: రెండో దశ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

TG: హైదరాబాద్లో రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జీవో 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 76.4 కి.మీ మేర రూ.24,269 కోట్ల వ్యయంతో దీనిని చేపడుతున్నారు. ఇందులో రాష్ట్ర వాటా, రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లుగా ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు.
Similar News
News March 25, 2026
డీలిమిటేషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది?

రాజ్యాంగం ప్రకారం పదేళ్లకోసారి <<19460921>>డీలిమిటేషన్<<>> (జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్ల పెంపు, నియోజకవర్గాల సరిహద్దుల సర్దుబాటు) చేపట్టాలి. గతంలో 1952, 1963, 1973లో చేపట్టారు. ఆ తర్వాత జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు నష్టం జరగొద్దని 25yrs నిలిపివేశారు. ఆ తర్వాత కూడా అవే పరిస్థితులు ఉండటంతో మరో 25yrs పొడిగించారు. 2002లో డీలిమిటేషన్ చేపట్టినా సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గ పరిధులను మాత్రమే మార్చారు.
News March 25, 2026
శాంతి చర్చలపై ట్రంప్కు ఇరాన్ షరతులు!

శాంతి చర్చలపై <<19470089>>ట్రంప్<<>> పెట్టిన షరతులకు కౌంటర్గా ఇరాన్ కూడా కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. గల్ఫ్లోని US బేస్లు మూసివేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని, ఈజిప్ట్ సూయజ్ కెనాల్ తరహాలోనే హార్ముజ్లో షిప్పుల రాకపోకలపై ఫీజు వసూలు చేసుకుంటామని, అన్ని ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు మిస్సైల్ ప్రోగ్రామ్ ఆంక్షలు పెట్టొద్దని, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
News March 25, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1122 పాయింట్లు లాభ పడి 75,190కు చేరగా నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 23,272 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్లో ట్రెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సహా 12కుపైగా స్టాక్స్ 2%పైగా లాభాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, యుద్ధంపై శాంతి చర్చలకు ప్రయత్నాలు జరగడం ఇందుకు ప్రధాన కారణాలు.


