News November 3, 2024
సౌతాఫ్రికాకు బయలుదేరిన టీమ్ ఇండియా

టీ20 సిరీస్ కోసం భారత జట్టు సౌతాఫ్రికాకు బయలుదేరింది. సహచర ఆటగాళ్లతో కలిసి విమానంలో దిగిన ఫొటోను T20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 8 నుంచి 15 వరకు జరిగే ఈ సిరీస్లో 4 మ్యాచుల్లో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.
Similar News
News January 11, 2026
పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ

నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన <<18824096>>పంత్<<>> న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ను ఎంపిక చేసినట్లు BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. అయితే రెగ్యులర్ కీపర్గా రాహుల్ ఉన్న నేపథ్యంలో రెండో వికెట్ కీపర్గా ఎంపికైన జురెల్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కాగా ఇవాళ 1.30pmకు వడోదరాలో తొలి వన్డే ప్రారంభం కానుంది.
News January 11, 2026
పంచె కట్టు నచ్చట్లేదు.. భర్తకు విడాకులిచ్చేస్తా!

భోపాల్లో ఫ్యామిలీ కోర్టుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. భర్త పౌరోహిత్యం చేస్తూ కష్టపడి చదివించి తన భార్యను SI చేశారు. తీరా ఆమె పోలీస్ ఉద్యోగం సంపాదించాక ఇప్పుడు భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కారు. భర్త ధోతీ కుర్తా ధరించడం, పిలక ఉంచుకోవడం తనకు నచ్చడం లేదని అది తన హోదాకు అవమానంగా ఉందని వాదిస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.
News January 11, 2026
ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.


