News November 4, 2024
నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు: అచ్చెన్నాయుడు

AP: నిత్యావసరాల వస్తువుల ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలపై భారం పెరగకుండా చూస్తామని తెలిపారు. ఈమేరకు నిత్యావసరాల ధరల పర్యవేక్షణపై సచివాలయంలో సమీక్షించారు. రైతు బజార్లలో ధరల పట్టికల ప్రదర్శన, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. సమీక్షలో పలువురు మంత్రులు, వ్యవసాయ, ఆర్థిక, పౌరసరఫరాల, మార్కెటింగ్శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం

TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తున్న ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గన్పార్క్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. వారి త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. మరోవైపు ఖమ్మంలో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
News September 17, 2025
మావోయిస్టు పార్టీ లేఖపై అనుమానాలు!

ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజైన లేఖపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇప్పటి వరకు ఇలా సంతకం, ఫొటోతో లేఖ రిలీజ్ కాలేదు. AUG 15వ తేదీ అని ఉంది. మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేస్తామనే ప్రకటన ఇంత సులభంగా ఉండదు. దానికి దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ ఉంటుంది’ అని చెబుతున్నారు. మరోవైపు ఈ లేఖను వెరిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News September 17, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,11,710కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 పతనమై రూ.1,02,400 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,42,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.