News November 7, 2024
ట్రంప్నకు కమల ఫోన్ కాల్

డొనాల్డ్ ట్రంప్నకు కమలా హారిస్ ఫోన్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రంప్నకు కాల్ చేసి కంగ్రాట్స్ తెలిపారు. అధికార మార్పిడిపై చర్చించేందుకు వైట్హౌస్కు రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై US ప్రజలను ఉద్దేశించి బైడెన్ త్వరలోనే ప్రసంగించనున్నట్లు వైట్హౌస్ వర్గాలు తెలిపాయి.
Similar News
News November 7, 2025
రథాల రామారెడ్డికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!

కామారెడ్డి(D)లోని రామారెడ్డిని పూర్వం దోమకొండ సంస్థానాధీశుడు రామిరెడ్డి పాలించడం, ఆ ఊరిలో రామాలయం పేరు మీదుగా రామారెడ్డి అనే పేరు వచ్చింది. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఒక రథం, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక రథం, ఇసన్నపల్లి-రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయంలో ఒక రథం ఉన్నాయి. ఇలా రథాలు ఉన్నందున పూర్వ కాలం నుంచే రథాల రామారెడ్డిగా పూర్వీకులు పిలుస్తున్నారు.
News November 7, 2025
TODAY TOP STORIES

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్పై భారత్ విక్టరీ.. సిరీస్లో 2-1 లీడ్
News November 7, 2025
మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.


