News November 9, 2024

BREAKING: ప్రవచనకర్త చాగంటికి కీలక పదవి

image

AP: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల చేసింది. నైతిక విలువల సలహాదారు-చాగంటి కోటేశ్వరరావు, మైనార్టీ వ్యవహారాల సలహాదారు-మహ్మద్ షరీఫ్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్-కుడిపుడి సత్తిబాబు, కళింగ ఛైర్మన్-రోణంకి కృష్ణం నాయుడు, కొప్పుల వెలమ- PVG కుమార్, తూర్పు కాపు-యశస్వి, రజక-సావిత్రి, వాల్మీకి-కప్పట్రాళ్ల సుశీలమ్మ.
*పూర్తి జాబితా కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

Similar News

News January 1, 2026

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంతంటే?

image

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగానే ఉంచింది. జనవరి-మార్చి త్రైమాసికానికి ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా 8వ క్వార్టర్‌లోనూ వడ్డీ రేట్లను సవరించకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన-8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్, PPF-7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్-4%, కిసాన్ వికాస్ పాత్ర-7.5, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-7.7, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్-7.4% వడ్డీ రేట్లు ప్రస్తుతమున్నాయి.

News January 1, 2026

ఒత్తువాములు కోరుతుంది, పలచన పాతర్లు కోరుతుంది

image

వాము (ఓమ) పంటను సాగు చేసేటప్పుడు మొక్కలు దగ్గర దగ్గరగా (ఒత్తుగా) ఉండాలి. అప్పుడే ఆ పంట దిగుబడి బాగుంటుంది. పాతర్లు (అంటే వరి నారు లేదా ఇతర కొన్ని రకాల పంటలు) నాటేటప్పుడు మొక్కల మధ్య తగినంత దూరం (పలచనగా) ఉండాలి. అప్పుడే ఆ మొక్కలకు గాలి, వెలుతురు సరిగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ పంటకు ఎంత దూరం ఉండాలో తెలిపే వ్యవసాయ సూత్రాన్ని ఈ సామెత చెబుతుంది.

News January 1, 2026

కొత్త ఏడాదిలో.. సంపద కోసం!

image

లక్ష్మీదేవి నివాసంగా భావించే వికసించే చెట్టు ఆకును, అలాగే శుభప్రదమైన బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం వల్ల ధన వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ స్వరూపమైన గవ్వలు, తామర గింజలను ఎర్రటి గుడ్డలో కట్టి పర్సు/బీరువాలో భద్రపరుచుకోవడం వల్ల డబ్బు నిలకడగా ఉంటుందని నమ్మకం. గోసేవ చేస్తే దైవానుగ్రహం లభించి ఏడాది పొడవునా మీ ఇంట్లో దారిద్ర్యం తొలగి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం.