News November 11, 2024

ఇప్పుడే వచ్చా.. అప్పుడే వణికితే ఎలా?: KTR

image

TG: మాజీ మంత్రి KTR ఢిల్లీ పర్యటనపై BRS, INC మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ‘అమృత్’ స్కామ్‌లో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని KTR అన్నారు. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన హస్తినకు వెళ్లారని మంత్రులు ఆరోపించారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన KTR ‘ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. అప్పుడే HYDలో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పుడే వణికితే ఎలా?’ అని సెటైర్ వేశారు.

Similar News

News February 18, 2026

ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

న్యూఢిల్లీలోని <>ఆయుష్<<>> మంత్రిత్వశాఖలో 7 కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://ayush.gov.in

News February 18, 2026

ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

image

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.

News February 18, 2026

మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

image

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.