News November 12, 2024
ఇజ్రాయెల్ దాడులు జాతి విధ్వంసమే: సౌదీ

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖండించారు. అవి పాలస్తీనీయుల నిర్మూలనకు జరుగుతున్న దాడులని, అంతర్జాతీయ సమాజం వాటిని అడ్డుకోవాలని కోరారు. ముస్లిం, అరబ్ నేతల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ గౌరవించాలని సూచించారు. పాలస్తీనా దేశం ఏర్పాటైతేనే తాము ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తామని యువరాజు తేల్చిచెప్పారు.
Similar News
News April 18, 2026
మహిళా రిజర్వేషన్లు.. సామాన్యులకు టికెట్ సాధ్యమా?

పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఒకవేళ చట్టం అమల్లోకి వచ్చినా దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఇప్పుడున్న రాజకీయ నేతల కుటుంబసభ్యులు, బంధువులేనని పలువురు పెదవి విరుస్తున్నారు. వారి భార్యకో, కూతురికో, కోడలికే టికెట్ వస్తుందని, సాధారణ మహిళలకు టికెట్ దక్కడం చాలా కష్టమంటున్నారు. మీ COMMENT?
News April 18, 2026
సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్ఫెక్ట్గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?
News April 18, 2026
రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.


