News November 12, 2024

ఇజ్రాయెల్ దాడులు జాతి విధ్వంసమే: సౌదీ

image

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖండించారు. అవి పాలస్తీనీయుల నిర్మూలనకు జరుగుతున్న దాడులని, అంతర్జాతీయ సమాజం వాటిని అడ్డుకోవాలని కోరారు. ముస్లిం, అరబ్ నేతల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ గౌరవించాలని సూచించారు. పాలస్తీనా దేశం ఏర్పాటైతేనే తాము ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తామని యువరాజు తేల్చిచెప్పారు.

Similar News

News March 9, 2026

ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

image

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.

News March 9, 2026

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

image

సూరత్‌(గుజరాత్‌)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.

News March 9, 2026

విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

image

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.