News November 13, 2024
ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే?

ఏడాదంతా దాదాపుగా స్థిరంగా ఉన్న ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలో అత్యధికంగా ఉల్లి ఉత్పత్తి చేసే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రైతుల నుంచి సరఫరా తగ్గడమే దీనికి కారణంగా తెలుస్తోంది. రబీ సీజన్లోని పాత నిల్వ తక్కువగా ఉండడంతో కొత్త నిల్వ ఇంకా మార్కెట్లకు రాలేదు. ఈ సరఫరా-డిమాండ్లో వ్యత్యాసం కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరో 10 రోజుల్లో ధరలు దిగొస్తాయంటున్నారు.
Similar News
News September 13, 2025
బీసీసీఐలో భజ్జీకి కీలక పదవి?

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు బీసీసీఐలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసింది. ఈమేరకు ఆయన ఈనెల 28న జరగనున్న ఏజీఎం మీటింగ్కు హాజరుకానున్నారు. అందులో బీసీసీఐ ప్రెసిడెంట్తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. మరి భజ్జీని ఏ పదవి వరిస్తుందో చూడాలి.
News September 13, 2025
ఫేక్ ప్రచారాలకు త్వరలోనే చెక్: మంత్రి అనిత

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.
News September 13, 2025
ఈమె తల్లి కాదు.. రాక్షసి

TG: ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్(D) శభాష్పల్లికి చెందిన మమతకు భాస్కర్తో వివాహం కాగా పిల్లలు చరణ్(4), తనుశ్రీ(2) ఉన్నారు. భాస్కర్తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. అదేరోజు తనుశ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.