News November 15, 2024
BGT: INDపై AUS గేమ్ప్లాన్

ఆసీస్లో అడుగుపెట్టిన IND ఒకేసారి 2 గేముల్లో తలపడాల్సి ఉంటుంది. ఒకటి క్రికెట్. రెండోది మైండ్గేమ్. కొన్నేళ్లుగా అక్కడిదే ఒరవడి. ముందు అక్కడి మీడియా భారత జట్టులో విభేదాలున్నట్టు నెరేటివ్ సృష్టిస్తుంది. ఆ తర్వాత పాంటింగ్ సహా ఇతర మాజీలు భారత క్రికెటర్ల ఫామ్ బాలేదని, ఓడిపోతారని చెప్పేస్తారు. కోహ్లీతో పెట్టుకోవద్దని అప్పట్లో మానేశారు. IND ఫామ్ లేమి, NZ చేతిలో క్లీన్స్వీప్ అవ్వడంతో మళ్లీ మొదలెట్టారు.
Similar News
News November 9, 2025
ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్లో రిలీఫ్ కోసం ఇలా టూర్లకు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
News November 9, 2025
చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.
News November 9, 2025
భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్లో భారీ డిమాండ్తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.


