News November 16, 2024

‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ: CM చంద్రబాబు

image

PM నరేంద్రమోదీ ‘బ్రాండ్‌ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేశారని AP CM చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రాండ్ బలంగా ఉంటేనే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ చేసింది అదేనన్నారు. ఇప్పుడాయన స్పష్టమైన విజన్, పాలసీ, డైరెక్షన్, ప్రాసెస్‌తో వికసిత్ భారత్ 2047 వైపు వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదని HTLS 2024లో అన్నారు.

Similar News

News September 16, 2025

నేడు భారీ వర్షాలు

image

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. అటు TGలో వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని IMD తెలిపింది.

News September 16, 2025

మెగా డీఎస్సీ: విజయవాడలో 5వేల మందికి బస

image

AP: మెగా DSCలో ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న CM చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు. దీని కోసం జోన్‌-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5వేల మంది విజయవాడ రానున్నారు. వారికి బస కోసం 13 పాఠశాలలను కేటాయించారు. అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 16, 2025

క్రమంగా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

image

దేశంలో 15 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసుండి పనిచేసే అవకాశం ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన కార్మిక సర్వే గణాంకాల ప్రకారం.. ఆగస్టులో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. ఇది జులైలో 5.2 శాతంగా, మే, జూన్ నెలల్లో 5.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు వరసగా మూడో నెలలో కూడా తగ్గింది. మేలో 5.1% ఉన్న రేటు ఆగస్టులో 4.3 శాతానికి తగ్గింది.