News November 16, 2024

‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ: CM చంద్రబాబు

image

PM నరేంద్రమోదీ ‘బ్రాండ్‌ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేశారని AP CM చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రాండ్ బలంగా ఉంటేనే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ చేసింది అదేనన్నారు. ఇప్పుడాయన స్పష్టమైన విజన్, పాలసీ, డైరెక్షన్, ప్రాసెస్‌తో వికసిత్ భారత్ 2047 వైపు వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదని HTLS 2024లో అన్నారు.

Similar News

News January 10, 2026

ప్రెగ్నెన్సీలో ఈ సమస్య రాకుండా ఉండాలంటే?

image

సాధారణంగా కొంతమందిలో గర్భధారణ సమయంలో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది. ఒకవేళ ఇంతకు ముందు లేకపోయినా కొంతమందిలో ఈ సమస్య ప్రెగ్నెన్సీ సమయంలో 4-5 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే ఈ సమస్య ఉందా లేదా అనేది చెక్‌ చేయించుకోవాలి. అందుకోసం దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే గర్భధారణ సమయంలో ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశముందంటున్నారు నిపుణులు.

News January 10, 2026

శని దోష నివారణకు దివ్యౌషధం ‘పుష్య మాస శనివారం’

image

పుష్యమాసంలో వచ్చే శనివారం శని దోష నివారణకు అత్యంత విశిష్టమైనదని జ్యోతిషులు చెబుతున్నారు. ఏలినాటి శని, అష్టమ శని ప్రభావంతో బాధపడేవారు ఈ నెలలో శని ఆరాధనతో సత్ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. నేడు శనైశ్చరుడుకి తైలాభిషేకం చేసి, నల్ల నువ్వులు దానం చేస్తే జాతక దోషాలు క్షీణించి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సూచిస్తున్నారు. శనిగ్రహ శాంతి పూజలు, మంత్రాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 10, 2026

వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు ఎలా?

image

రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (AEO) లేదా వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు తీసుకొని, తమకు కావలసిన యంత్రం వివరాలను నింపి ఇవ్వాలి. దానిని వారు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. MRO, MPDO, AOలతో కూడిన ‘మండల స్థాయి కమిటీ’ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతుంది. వారి ఆమోదం తర్వాత, యంత్రాలిచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.