News November 16, 2024
‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ: CM చంద్రబాబు

PM నరేంద్రమోదీ ‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేశారని AP CM చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రాండ్ బలంగా ఉంటేనే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ చేసింది అదేనన్నారు. ఇప్పుడాయన స్పష్టమైన విజన్, పాలసీ, డైరెక్షన్, ప్రాసెస్తో వికసిత్ భారత్ 2047 వైపు వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదని HTLS 2024లో అన్నారు.
Similar News
News April 16, 2026
బంగ్లాదేశ్ క్రికెటర్ రుబెల్ రిటైర్మెంట్

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్(36) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ జట్టు తరఫున 27 టెస్టులు, 104 వన్డేలు, 28 టీ20లు ఆడి 193 వికెట్లు పడగొట్టారు. 2021 ఏప్రిల్లో న్యూజిలాండ్తో ఆడిన టీ20 మ్యాచే ఆయనకు చివరిది. గాయాలతో అప్పటి నుంచి జట్టుకు దూరమవుతూ వచ్చారు. ఇక వన్డేల్లో అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి బంగ్లాదేశ్ బౌలర్గా రుబెల్ పేరిట రికార్డ్ ఉంది.
News April 16, 2026
పెద్ది రిలీజ్ డేట్ అందుకే ప్రకటించలేదా?

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ రిలీజ్ను సినిమా యూనిట్ జూన్కు వాయిదా వేసింది. కానీ డేట్ను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే 2సార్లు పోస్ట్పోన్ అయిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్. జూన్ 4న యశ్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది. అది కూడా వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేయాలని పెద్ది యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
News April 16, 2026
ORR అలైన్మెంట్పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

AP: అమరావతి ORR నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయ, ఈశాన్య పరిధిలోని అలైన్మెంట్ను సవాల్ చేస్తూ దాఖలైన PILపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ORR నిర్మాణం ఎక్కడ జరగాలో పిటిషనర్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నిపుణుల బృందం ఖరారు చేసిన అలైన్మెంట్లలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.


