News November 16, 2024
T20 సిరీస్ ఆసీస్ కైవసం

పాకిస్థాన్తో జరుగుతున్న 3 టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. రెండో టీ20లో ఆసీస్ 13 రన్స్ తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా తొలుత 20 ఓవర్లలో 147/9 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 19.4 ఓవర్లు ఆడి 134 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (52) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. స్పెన్సర్ జాన్సన్ 5 వికెట్లతో చెలరేగారు. నామమాత్రపు చివరి టీ20 ఎల్లుండి హోబర్ట్లో జరుగుతుంది.
Similar News
News April 19, 2026
భారత్తో బంధం వెరీ స్ట్రాంగ్: ఇరాన్

భారత్, ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపారు.
News April 19, 2026
చదువు ప్రాధాన్యం తెలుసుకోండి!

విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: అందమైన హంసలతో కలిసి తిరిగినంత మాత్రాన కొంగ ఎప్పటికీ హంస కాలేదు. అలాగే చదువు రానివాడు, నేర్చుకోవాలనే కుతూహలం లేని వాడు విద్వాంసుల దగ్గర ఉన్నప్పటికీ పండితుడు కాలేడు. అందుకే ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>
News April 19, 2026
టిమ్ డేవిడ్.. IPLలో అరుదైన మైల్స్టోన్

ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిట్టర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. IPLలో అతి తక్కువ బంతుల్లో (560) వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) తర్వాత ఆయనే టాప్. అంతేకాదు కనీసం వెయ్యి పరుగులు చేసిన వారిలో 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక బ్యాటర్ డేవిడ్ కావడం విశేషం.


