News November 17, 2024
వృద్ధులు, వికలాంగులకే ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు’!

AP: ప్రజలు ఎక్కడి నుంచైనా తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తీసుకొచ్చిన ‘ఎనీవేర్’ విధానంపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. దీనిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ విధానాన్ని 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకోసం మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మేరకు అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదిస్తే వెంటనే అమల్లోకి రానున్నాయి.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.