News November 18, 2024

సర్వేలో అప్పులు తప్ప ఆస్తులు చెప్పట్లేదు!

image

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ప్రజలు పూర్తి వివరాలు చెప్పేందుకు భయపడుతున్నారు. కులం, కుటుంబ వివరాలు, అప్పులు, చదువుల వివరాలు మాత్రమే వెల్లడిస్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతర వివరాలు చెప్పేందుకు జంకుతున్నారు. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయం, రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగిస్తారన్న అనుమానంతో ఈ వివరాలు కరెక్టుగా చెప్పడం లేదు. కొందరైతే ఆధార్ నంబర్లు ఇచ్చేందుకూ ఆలోచిస్తున్నారు.

Similar News

News December 26, 2025

సూర్యవంశీకి ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’

image

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(14)కి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. వీర్ బాల్ దివస్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అందుకున్నారు. చిన్న వయసులో కల్చర్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్‌లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది 18 రాష్ట్రాల నుంచి 20 మంది పిల్లలు దీనికి ఎంపికయ్యారు.

News December 26, 2025

సీసీఎంబీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

హైదరాబాద్‌లోని CCMBలో 9 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, MSc (నేచురల్ సైన్స్), BE, B.Tech, PhD (బయో ఇన్ఫర్మాటిక్స్/జెనిటిక్స్/లైఫ్ సైన్స్, జీనోమిక్స్, మైక్రో బయాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in

News December 26, 2025

జామలో తెల్ల సుడిదోమను ఎలా నివారించాలి?

image

తెల్లసుడి దోమ పిల్ల పురుగులు జామ ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో ఉండి, రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. జిగురు పూసిన పసుపురంగు అట్టలను చెట్టు కొమ్మలకు వేలాడతీయాలి. తెగులు ఆశించిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. తర్వాత లీటరు నీటిలో 5మి.లీ వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి హాస్టాథియాన్ 1మి.లీ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.