News November 19, 2024
World Workforce: 20% మనోళ్లే!

ప్రపంచ కార్మిక శక్తిలో భారత్ కీలకపాత్ర పోషించనుంది. 2023-50 మధ్య కాలంలో అత్యధికంగా 20% వర్క్ఫోర్స్ను కంట్రిబ్యూట్ చేయనున్నట్టు Angel One Wealth అంచనా వేసింది. అదే సమయంలో చైనా నిష్పత్తి తగ్గే పరిస్థితి ఉందని పేర్కొంది. భారత్లో అధిక ఆదాయ కుటుంబాల సంఖ్య 2030కి మూడింతలయ్యే అవకాశం ఉందని, ఇది వ్యక్తిగత ఆదాయ వృద్ధి దేశాల్లో భారత్ను ముందువరుసలో నిలుపుతుందని వివరించింది.
Similar News
News January 14, 2026
సంక్రాంతి పురుషుడి గురించి తెలుసా?

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో గోచరించే రూపమే ‘సంక్రాంతి పురుషుడు’. ప్రతి ఏడాది ఆయన ఓ ప్రత్యేక వాహనంపై, విభిన్న వస్త్రాలు, ఆభరణాలతో వస్తాడని పంచాంగం చెబుతుంది. ఆయన ధరించే వస్తువులు, చేసే పనులను బట్టి ఆ ఏడాది దేశంలో వర్షాలు, పంటలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో జ్యోతిషులు అంచనా వేస్తారు. సంక్రాంతి పురుషుడి ఆగమనం ప్రకృతిలో వచ్చే మార్పులకు, భవిష్యత్తుకు సూచికగా భావిస్తారు.
News January 14, 2026
నేడు రెండో వన్డే.. సిరీస్పై టీమ్ ఇండియా గురి

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జరగనుంది. 3 ODIల సిరీస్లో ఇప్పటికే ఒకటి టీమ్ ఇండియా గెలవగా రెండోది కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్లో అదరగొట్టారు. ఇక కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నారు. అదే విధంగా బౌలర్లు కూడా రాణిస్తే సిరీస్ మనదే అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి JioHotstar, Star Sportsలో వస్తుంది.
News January 14, 2026
మహిళలకు రూ.1500 ఎప్పుడు ఇస్తారు: YS షర్మిల

AP: ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మహాశక్తి పథకాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. పండుగల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.


