News November 20, 2024
ఇన్వెస్టర్లకు నితిన్ కామత్ హెచ్చరిక

ట్రేడింగ్ పేరుతో నకిలీ యాప్, వెబ్సైట్ల ఆగడాలు పెరుగుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను జిరోదా కో-ఫౌండర్ నితిన్ కామత్ హెచ్చరించారు. ఇలాంటి ఉదంతాల గురించి చదవని, వినని రోజంటూ లేదని పేర్కొన్నారు. అందువల్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆత్రుతపడకుండా ఆయా వేదికలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. మరీ ఆకర్షణీయ ప్రకటనలు కచ్చితంగా నకిలీవి అయ్యుంటాయని హెచ్చరించారు.
Similar News
News April 19, 2026
మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. తన కూతురు దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. రణ్వీర్ సింగ్, దీపిక 2018లో వివాహం చేసుకోగా, 2024లో కూతురు జన్మించిన సంగతి తెలిసిందే.
News April 19, 2026
ఇంటర్ సెకండియర్కూ ఇంప్రూవ్మెంట్.. ఫీజు ఎంతంటే?

AP: ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం <<19683959>>ఇంప్రూవ్మెంట్<<>> రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.
News April 19, 2026
నేడే అక్షయ తృతీయ.. బంగారం ధర ఎంతంటే?

ఇవాళ అక్షయ తృతీయ కావడంతో చిన్న బంగారు వస్తువైనా కొని ఇంటికి తెస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చాలామంది నమ్మకం. అయితే పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఉండటం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,780 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800కు విక్రయిస్తున్నారు.


