News November 21, 2024

టెన్త్ విద్యార్థులకు శుభవార్త

image

AP: పదో తరగతి పరీక్షలను విద్యార్థులు తెలుగులోనూ రాసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఇంగ్లిష్/తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు ఆప్షన్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ ఒక్క ఏడాదికే ఇది వర్తించనుంది. 2020-21లో 1-6 తరగతులను ఇంగ్లిష్(M)లోకి మార్చిన ప్రభుత్వం, వారు టెన్త్‌కు వచ్చాక ENGలోనే పరీక్షలు రాయాలని రూల్ పెట్టింది.

Similar News

News April 18, 2026

ప్రతిపక్షాలపై PM మోదీ ఆగ్రహం

image

కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా సంబరాలు చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.

News April 18, 2026

పిల్లలతో నయన్, విఘ్నేశ్ క్యూట్ పిక్స్

image

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఖాళీ సమయంలో ఉయిర్, ఉలగ్‌లతో ఈ జంట సరదాగా గడిపారు. తమ చిన్నారుల అల్లరికి సంబంధించిన చిత్రాలను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీ పేరెంట్స్‌గా వారు పంచుకున్న ఈ మధుర క్షణాలు ట్రెండింగ్‌లో నిలిచాయి.

News April 18, 2026

అప్పుల్లో గేల్.. తానే సాయం చేశానన్న లలిత్ మోదీ

image

2011 ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన గేల్‌ను జట్టులోకి తీసుకొమ్మని RCBకి చెప్పింది తానేనని IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వెల్లడించారు. ‘వేలంలో గేల్ అమ్ముడుపోలేదు. ఎన్ని ఫ్రాంచైజీలను సంప్రదించినా నో అన్నారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పులున్నాయి.. ఎలాగైనా ఆడాలని అన్నాడు. ఇంజూరీ ప్లేయర్‌ స్థానంలో తీసుకొమ్మని విజయ్ మాల్యాను రిక్వెస్ట్ చేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2011లో గేల్ 608 రన్స్ చేశారు.