News November 21, 2024
టెన్త్ విద్యార్థులకు శుభవార్త

AP: పదో తరగతి పరీక్షలను విద్యార్థులు తెలుగులోనూ రాసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఇంగ్లిష్/తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు ఆప్షన్ను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ ఒక్క ఏడాదికే ఇది వర్తించనుంది. 2020-21లో 1-6 తరగతులను ఇంగ్లిష్(M)లోకి మార్చిన ప్రభుత్వం, వారు టెన్త్కు వచ్చాక ENGలోనే పరీక్షలు రాయాలని రూల్ పెట్టింది.
Similar News
News April 19, 2026
సెన్సస్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

AP: కేంద్రం చేపట్టిన జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు సూచించారు. సెన్సస్ సిబ్బందిమంటూ ఇళ్ల వద్దకు వచ్చి OTPలు అడిగితే చెప్పొద్దని, వేలిముద్రలు, ఐరిస్కు ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కాగా ప్రస్తుతం <<19674967>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> జరుగుతుండగా, మే 1 నుంచి జనగణన మొదలవనుంది.
News April 19, 2026
రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.
News April 19, 2026
పాక్లో రేపు చర్చలు.. డీల్ చేసుకోవాల్సిందే: ట్రంప్

ఇరాన్తో చర్చలకు తమ బృందం రేపు సాయంత్రానికి పాకిస్థాన్ చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. డీల్ కుదుర్చుకోకపోతే ప్రతీ పవర్ ప్లాంట్, బ్రిడ్జ్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు. హార్ముజ్లో ఫ్రెంచ్, యూకే నౌకలపై ఇరాన్ బోట్లు దాడి చేయడం సీజ్ఫైర్ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.


