News November 22, 2024

డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్

image

TG: తమ డిమాండ్ల సాధనకు డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌తో పాటు HYDలో లక్ష మందితో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామని రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ప్రకటించింది. HYDలో 20వేల కొత్త ఆటోలకు పర్మిట్ ఇవ్వాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించి, యాక్సిడెంట్ బీమాను రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఒక్కో ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.12వేల ఆర్థిక సాయం పథకాన్ని వెంటనే అమలు చేయాలని పేర్కొంది.

Similar News

News January 17, 2026

మహబూబ్‌నగర్‌ జిల్లాకు నేడు CM రేవంత్‌

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని చిట్టిబోయినపల్లిలో ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యకు కొత్త ఊపొస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య అందుబాటులోకి రానుందని నిపుణులు అంటున్నారు.

News January 17, 2026

నటి శారదకు ప్రతిష్ఠాత్మక అవార్డు

image

మలయాళ చిత్రసీమలో అత్యున్నత గౌరవంగా భావించే జేసీ డానియల్ అవార్డు-2024ను సీనియర్ నటి శారదకు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మలయాళ సినిమాకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇచ్చింది. రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో కూడిన ఈ అవార్డును ఈ నెల 25న CM పినరయి విజయన్ అందజేయనున్నారు. ఈ అవార్డు పొందిన 32వ సినీ ప్రముఖురాలిగా శారద నిలిచారు.

News January 17, 2026

యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

image

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.