News November 23, 2024
తీవ్ర ఉత్కంఠ.. నాందేడ్లో కాంగ్రెస్ విజయం

MHలోని నాందేడ్ లోక్సభ సీటు ఉపఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. BJP, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడింది. చివరకు 1,457 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్రావ్ గెలిచారు. రవీంద్రకు 5,86,788 ఓట్లు రాగా, BJP అభ్యర్థి సంతుక్రావ్ హంబార్డేకు 5,85,331 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ వసంతరావ్ చవాన్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఆయన కుమారుడు రవీంద్రకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
Similar News
News September 18, 2025
వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు కూడా భారీగా లాభాలు ఆర్జించాయి.
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<