News November 24, 2024

208 ఓట్ల తేడాతో గెలిచిన మహా కాంగ్రెస్ చీఫ్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం మూట కట్టుకోగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కారు. సకోలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అవినాష్ బ్రహ్మంకర్‌పై 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోలేకు 96,795 ఓట్లు రాగా, బ్రహ్మంకర్‌కు 96,587 ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా అత్యల్ప మెజారిటీ MIM అభ్యర్థి ముఫ్తీ మహ్మద్ ఖలీక్‌(162 ఓట్లు)ది కావడం గమనార్హం.

Similar News

News November 4, 2025

వరల్డ్‌కప్ విజేతలు విక్టరీ పరేడ్‌కు దూరం

image

ICC ఉమెన్స్ వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్‌‌కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్‌లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్‌ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్‌కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

News November 4, 2025

మునగాకు పొడితో యవ్వనం

image

ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో మునగాకుపొడి కీలకపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు బరువు, ఒత్తిడిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ పొడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, కురులు మెరుపును సంతరించుకుంటాయి. దీంట్లోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి.

News November 4, 2025

రేపే కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలంటే?

image

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానమాచరించి, శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నదీ స్నానం చేయలేనివారు గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుంది. తులసి పూజతో పాటు 365 వత్తులతో దీపం వెలిగించాలి. శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం’ అని అంటున్నారు.
☞ కార్తీక పౌర్ణమి గురించి మరిన్ని విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.