News November 27, 2024
టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

AP: త్వరలో జరిగే సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలని CM చంద్రబాబు TDP నేతలకు సూచించారు. MLAలు, MPలు, MLCలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘గత నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు చేపడితే ఇప్పటివరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం’ అని చెప్పారు.
Similar News
News November 5, 2025
గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News November 5, 2025
ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్లో విజయం

న్యూయార్క్ (అమెరికా) మేయర్గా <<18202940>>మమ్దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<


