News November 28, 2024

పెళ్లికి ఫేక్ జువెల్లరీ గిఫ్ట్.. విచారణకు ఆదేశం

image

యూపీలో వెనుకబడిన అమ్మాయిల పెళ్లిళ్ల కోసం అమలు చేస్తోన్న మాస్ మ్యారేజెస్ స్కీమ్‌లో రోజుకో కొత్త అవినీతి వెలుగుచూస్తోంది. ఇన్ని రోజులు ఫేక్ పెళ్లిళ్లు బయటపడగా తాజాగా ఫేక్ గిఫ్టుల తతంగం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా పెళ్లి చేసుకున్న జంటకు కానుకలు ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు నకిలీ బంగారు ఆభరణాలు, నాణ్యతలేని కానుకలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఓ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.

Similar News

News January 25, 2026

‘సభా సార్’తో గ్రామసభ రికార్డుల డిజిటలైజేషన్

image

TG: రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో ‘సభా సార్‌’ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని కేంద్రం కోరింది. దీంతో సమావేశాల్లో చర్చించిన అంశాల ఆడియో/వీడియో రికార్డింగ్స్‌తో ఆటోమేటిక్‌గా సమావేశ మినిట్స్ రూపొందించవచ్చని తెలిపింది. దీని వల్ల శ్రమ తగ్గి, పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.

News January 25, 2026

పద్మ అవార్డుల ప్రకటన

image

వివిధ రంగాల్లో సేవలందించిన 45 మంది వ్యక్తులకు కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డి(పాడి, పశుసంవర్ధక విభాగం), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌(జన్యు సంబంధ పరిశోధనలు), తమిళనాడుకు చెందిన నటేశన్ తదితరులు ఉన్నారు.

News January 25, 2026

అగ్నిప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

image

TG: నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో <<18951833>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్నిమాపక నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.