News November 30, 2024
ఫెంగల్ ఎఫెక్ట్.. విమానాలు రద్దు

తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో చెన్నైలో కుండపోత వానలు, బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో HYD నుంచి చెన్నై వెళ్లాల్సిన 3 విమానాలు, చెన్నై నుంచి HYD రావాల్సిన 3 ఫ్లైట్స్ రద్దయ్యాయి. అలాగే HYD నుంచి తిరుపతి వెళ్లాల్సిన 7 విమానాలు, తిరుపతి నుంచి HYD రావాల్సిన 7 విమానాలను అధికారులు రద్దు చేశారు. ముంబై, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన 2 ఫ్లైట్స్ను దారి మళ్లించారు.
Similar News
News November 6, 2025
కుంకుమ పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు

ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తీసుకుంటే బిడ్డ తెల్లగా పుడతాడని చాలామంది భావిస్తారు. బిడ్డ చర్మ ఛాయ తల్లిదండ్రుల జీన్స్ని బట్టి ఉంటుందంటున్నారు నిపుణులు. కానీ ప్రెగ్నెన్సీలో కుంకుమపువ్వును తీసుకుంటే అజీర్తి, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఒత్తిడి, వేవిళ్లు, అధిక రక్తపోటు, ఐరన్ లోపం వంటివి తగ్గుతాయి. రోజుకు 2-3 రేకల్ని గ్లాసుపాలలో వేసుకొని తీసుకుంటే చాలు. దీనికి ముందు డాక్టరు సలహా తీసుకోవడం ముఖ్యం.
News November 6, 2025
మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే?

మనం చేసే ఏ పనినైనా కృష్ణార్పణంగానే చేయాలని ఆ భగవంతుడే ఉపదేశించాడు. ఎప్పుడూ భగవంతుని పనులలోనే నిమగ్నమై ఉంటే, ఇతర ఆలోచనలకు తావుండదు. దీన్నే అవ్యభిచారిత భక్తి అంటారు. ఏకాగ్రత, నిశ్చలత కలిగిన ఈ భక్తిని శుద్ధ భక్తి, అనన్య భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి మార్గం గురించి శ్రీమద్భగవద్గీతలో వివరంగా ఉంది. మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించడమే నిజమైన, శుద్ధ భక్తి. వీటన్నింటి సారం తెలియాలంటే భగవద్గీత చదవాలి.
News November 6, 2025
ముగ్గురు కూతుళ్లు మృతి.. పరిహారం అందజేత

TG: బస్సు ప్రమాదంలో మరణించిన <<18204239>>ముగ్గురు<<>> అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.


