News December 1, 2024

బియ్యం అక్రమ రవాణాలో నిజాల నిగ్గుతేల్చాలి: ద్వారంపూడి

image

AP: కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, MLA కొండబాబు తన పేరు ప్రస్తావించడంపై YCP నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. Dy.CM పవన్ ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటే కొండబాబు చరిత్ర తెలుస్తుందని చెప్పారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అధికారంలో ఉన్నవారు వాస్తవాల నిగ్గుతేల్చాలని సూచించారు.

Similar News

News January 28, 2026

ICET షెడ్యూల్ విడుదల

image

TG: MBA, MCA కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET-2026 షెడ్యూల్ విడుదలైంది.
*ఫిబ్రవరి 6న నోటిఫికేషన్
*ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
*మార్చి 16- దరఖాస్తులకు చివరి తేదీ
*మే 13, 14న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్
**అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, ఇతర అన్ని విభాగాల వారికి రూ.750. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు.

News January 28, 2026

నేను పార్టీ మారినట్లు BRS భావిస్తోంది: దానం

image

TG: తాను BRSకు రాజీనామా చేయలేదని, అలాగే తనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ‘2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా. వ్యక్తిగత హోదాలోనే ఆ మీటింగ్‌కు హాజరయ్యా. నేను పార్టీ మారినట్లు BRS భావిస్తోంది’ అని తెలిపారు. మరోవైపు తనపై వేసిన అనర్హత పిటిషన్‌పై ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు.

News January 28, 2026

‘నాన్నా.. నేను విమానంలో అజిత్ పవార్‌తో వెళ్తున్నా’

image

విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తోపాటు ఫ్లైట్ అటెండెంట్‌ పింకీ మాలి కూడా చనిపోయారు. ముంబైకి చెందిన పింకీ చివరిసారిగా తన తండ్రి శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నాన్నా నేను అజిత్ పవార్‌తో కలిసి విమానంలో బారామతి వెళ్తున్నా. అక్కడి నుంచి నాందేడ్ వెళ్లి మీతో రేపు మాట్లాడుతా’ అని చెప్పినట్లు శివ తెలిపారు. తన కూతురిని కోల్పోయానని, ఆమె మృతదేహాన్ని తెస్తే అంత్యక్రియలు నిర్వహిస్తానని కన్నీళ్లుపెట్టుకున్నారు.