News December 1, 2024

అల్లు అర్జున్.. నంద్యాలలో ప్రీరిలీజ్ పెట్టండి: ఎంపీ శబరి

image

పుష్ప-2 విడుదల సందర్భంగా ఆ మూవీ హీరో అల్లు అర్జున్‌పై ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు. అదే తరహాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి నంద్యాలలో ప్లాన్ చేయండి. మీరు నంద్యాలకు రావడమనే సెంటిమెంట్ మాకు బాగా పనిచేసింది. మీ పుష్ప-2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 22, 2026

వరి వద్దు ఈ పంటలు వేయండి: సీఎం

image

TG: కష్టం తక్కువగా ఉంటుందని రైతులు వరి పండిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలకు మన దేశంలో పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా నిల్వలు మిగిలే ఉంటున్నాయి. ఈసారి 50 లక్షల టన్నుల కంటే ఎక్కువ వరి కొనబోమని కేంద్రం చెప్పింది. ఇప్పటికే 70 లక్షల టన్నులు కొన్నాం. మిగతా వరి ఏం చేయాలి? అందుకే రైతులు మిల్లెట్లు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించాలి’ అని సిద్దిపేటలో సూచించారు.

News March 22, 2026

రైతుల కోసం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం: రేవంత్

image

TG: ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ సిద్దిపేటలో తెలిపారు. ‘కేసీఆర్ రైతుల కోసం నెలకు సగటున రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే మేము రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉచిత కరెంటు, గిట్టుబాటు ధర, వడ్లకు బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, రైతు బీమా, నష్టపరిహారం అందిస్తూ రైతును రాజును చేస్తున్నాం. ఇప్పటివరకు రైతుల కోసం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం’ అని చెప్పారు.

News March 22, 2026

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

image

TG: సిద్దిపేట పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదల చేశారు. 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ₹3,600 కోట్లను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో రేపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. 45 రోజుల్లో 3 విడతల్లో రూ.9వేల కోట్లు అకౌంట్లలో జమ చేయనున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.