News December 2, 2024

సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట

image

YCP సోషల్ మీడియా మాజీ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీం‌లో ఊరట దక్కలేదు. తనపై నమోదైన FIRలు కొట్టేయాలని పిటిషన్ వేయగా, హైకోర్టు ముందే విజ్ఞప్తులు చెప్పుకోవాలని సుప్రీం‌ పేర్కొంది. అటు, తనపై రాష్ట్ర‌వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న భార్గవ పిటిషన్లపై NOV 29న AP హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్‌ 6కి విచారణ వాయిదా వేస్తూ, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Similar News

News November 12, 2025

చైనాకు భారత జనరిక్ మెడిసిన్!

image

భారత్ విషయంలో చైనా క్రమంగా నిబంధనలు సడలిస్తోంది. జనరిక్ ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. గత నెలలో నిర్వహించిన టెండర్‌లో సిప్లా, నాట్కో, హెటిరో, రెడ్డీస్ వంటి ఫార్మా సంస్థలు చైనా ప్రభుత్వ నిర్వహణలోని ఆసుపత్రులకు జనరిక్ మందులను సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. ఈ సంస్థలు ‘డపాగ్లిఫ్లోజిన్’ అనే మధుమేహ నియంత్రణ టాబ్లెట్లను సప్లై చేయనున్నాయి. ఇతర టాబ్లెట్లూ సరఫరా చేయనున్నాయి.

News November 12, 2025

నాగార్జునపై కామెంట్స్.. అర్ధరాత్రి సురేఖ ట్వీట్

image

TG: హీరో నాగార్జున, ఆయన కుటుంబంపై <<14263103>>గతంలో<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాసుకొచ్చారు. అయితే అసందర్భంగా అర్ధరాత్రి 12 గం.కు సురేఖ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. కాగా ఆమెపై నాగ్ వేసిన పరువునష్టం కేసు కొనసాగుతోంది.

News November 12, 2025

మధ్యాహ్న భోజనంలో ఫిష్ కర్రీ: మంత్రి శ్రీహరి

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో ఫిష్ కర్రీస్, ఇతర ఆహార పదార్థాలను వండిపెట్టేలా చూస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. త్వరలోనే అమలు చేసేందుకు సీఎం రేవంత్‌తో మాట్లాడుతానని తెలిపారు. రాష్ట్రంలో 26 వేల నీటి వనరుల్లో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. వీటిలో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను రిలీజ్ చేస్తామని చెప్పారు.