News December 3, 2024

ప్రజల వద్దే రూ.6,839 కోట్ల రూ.2వేల నోట్లు: RBI

image

దేశ ప్రజల వద్ద ఇప్పటికీ రూ.6,839 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 29 నాటికి 99.08 శాతం నోట్లు తిరిగొచ్చాయని తెలిపింది. 2023 మే 19 నుంచి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం HYDతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్పిడి చేసుకునే వీలుంది.

Similar News

News November 3, 2025

కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆగి..

image

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183371>>బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

News November 3, 2025

కొన్ని క్యాచులు ట్రోఫీలను గెలిపిస్తాయి!

image

క్రికెట్‌లో క్యాచులు మ్యాచులనే కాదు.. <<18182320>>వరల్డ్ కప్‌<<>>లను కూడా గెలిపిస్తాయి. 1983WC ఫైనల్లో కపిల్ దేవ్ వివ్ రిచర్డ్స్(WI) క్యాచ్‌ పట్టి తొలి ట్రోఫీని అందించారు. 2024-T20WC ఫైనల్లో డేవిడ్ మిల్లర్(SA) ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ చాకచక్యంగా అందుకోవడంతో కప్ సొంతమైంది. తాజా WWCలో SA కెప్టెన్ లారాను అమన్‌జ్యోత్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు అపూర్వ విజయం దక్కింది.

News November 3, 2025

APPLY NOW: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

image

యూనివర్సిటీ ఆఫ్ కాలికట్‌ 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://uoc.ac.inను సంప్రదించండి.