News December 3, 2024
ప్రజల వద్దే రూ.6,839 కోట్ల రూ.2వేల నోట్లు: RBI
దేశ ప్రజల వద్ద ఇప్పటికీ రూ.6,839 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 29 నాటికి 99.08 శాతం నోట్లు తిరిగొచ్చాయని తెలిపింది. 2023 మే 19 నుంచి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం HYDతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్పిడి చేసుకునే వీలుంది.
Similar News
News January 25, 2025
చంద్రబాబుకు బిల్ గేట్స్ గిఫ్ట్
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్ను ఇచ్చారని AP CM చంద్రబాబు తెలిపారు. కాలేజీని వదిలి మైక్రోసాఫ్ట్ను ఎలా ప్రారంభించారు? ఆయన జర్నీకి సంబంధించిన అనుభవాలు, పాఠాలను ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. ఈ బుక్ చాలా మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. బిల్ గేట్స్కు ఆల్ ది బెస్ట్తో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దావోస్లో వీరిద్దరూ భేటీ అయిన సంగతి తెలిసిందే.
News January 25, 2025
జగన్, VSR కలిసి డ్రామా ఆడుతున్నారు: బుద్దా వెంకన్న
AP: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్కు తెలిసే జరిగిందని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. ‘కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను. నిన్ను క్షమించను. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేలాలి. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి CBI అనుమతి ఇవ్వకూడదు’ అని ట్వీట్ చేశారు.
News January 25, 2025
నేడు VSR రాజీనామా
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు ఉపరాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఢిల్లీలో ఈ రోజు ఉ.10.30 గంటలకు ఆయనను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. కాగా, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని VSR తెలిపారు. తాను ఏ రాజకీయా పార్టీలోనూ చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని ట్వీట్ చేశారు.