News December 3, 2024
ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే: కూనంనేని

TG: ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే అని CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ‘ములుగు ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ జరపాలి. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. రేషన్ కార్డులు, పెన్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. బీఆర్ఎస్కు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కూనంనేని విమర్శించారు.
Similar News
News October 24, 2025
సమస్యలను దూరం చేసే వాస్తు దిక్కును ఎలా ఎంచుకోవాలి?

ఇల్లు కట్టుకునేటప్పుడు/కొనేటప్పుడు ఆ ఇంటి దిక్కు మనకు మంచి చేస్తుందా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. జన్మరాశి ఆధారంగా మన ఇంటికి ఏ దిక్కు అనుకూలమో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. ‘జన్మ రాశి, నక్షత్రం తెలియకపోయినా, పేరు బలాన్ని ఉపయోగించి ఏ దిక్కు శుభప్రదమో తెలుసుకోవచ్చు. వాస్తు విషయంలో దిక్కుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 24, 2025
న్యూస్ అప్డేట్స్

➤ J&Kలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రిలీజ్. 3 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, క్రాస్ ఓటింగ్తో ఒక స్థానంలో BJP గెలుపు
➤ బిహార్లో BJP-JDU కూటమి CM అభ్యర్థి నితీశ్ కుమార్ అని స్పష్టం చేసిన PM మోదీ.
➤ AP: తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
➤ TG: జూబ్లీహిల్స్ తుది ఓటర్ లిస్ట్ రిలీజ్. మొత్తం 4,01,365 మంది ఓటర్లు.
News October 24, 2025
పవన్ కళ్యాణ్తో హైడ్రా రంగనాథ్ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. మంగళగిరి క్యాంప్ ఆఫీస్లో ఈ భేటీ జరిగింది. సుమారు రెండు గంటల పాటు వారిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీకి గల కారణాలు తెలియాల్సి ఉంది.


