News December 3, 2024

ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే: కూనంనేని

image

TG: ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే అని CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ‘ములుగు ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ జరపాలి. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. రేషన్ కార్డులు, పెన్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. బీఆర్‌ఎస్‌కు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కూనంనేని విమర్శించారు.

Similar News

News January 17, 2025

సంక్రాంతి ఎఫెక్ట్.. రూ.400 కోట్ల మద్యం తాగేశారు!

image

AP: రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు ₹400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో ₹150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల సేల్ జరుగుతుండగా, ఈ 3 రోజుల్లో ₹160cr అదనంగా అమ్ముడైంది. ఈనెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29L కేసుల బీరు అమ్ముడైంది. గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ రేంజ్‌లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

News January 17, 2025

కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే..

image

సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.
SHARE IT

News January 17, 2025

రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టాడు: KTR

image

TGలో ఇచ్చిన హామీలు అమలు చేయని CM రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టారని KTR విమర్శించారు. ఆయన వ్యవహారం తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని ట్వీట్ చేశారు. ‘ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు ₹2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? ₹5లక్షల విద్యాభరోసా ఎక్కడ? ఇక్కడి హామీలకే దిక్కు లేదు.. <<15169364>>ఢిల్లీలో హామీలకు గ్యారంటీ<<>> ఇస్తున్నావా?’ అని ప్రశ్నించారు.