News April 6, 2024
తొలిసారి ఓటు వేయనున్న 92 ఏళ్ల వృద్ధుడు

ఝార్ఖండ్లో 92 ఏళ్ల వృద్ధుడు ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. సాహిబ్గంజ్ జిల్లా ముండ్రో బ్లాకు పోలింగ్ బూతులో ఖలీల్ అన్సారీ అనే వృద్ధుడు తాను ఇప్పటివరకు ఎన్నికల్లో ఓటు వేయలేదని, తనకు ఓటు హక్కే లేదని ఎన్నికల అధికారులకు చెప్పారు. విషయం తెలుసుకున్న CEO రవికుమార్ వెంటనే అన్సారీ పేరును ఓటరు జాబితాలో చేర్చాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జూన్ 1న జరగనున్న పోలింగ్లో ఆయన తొలిసారి ఓటు వేయనున్నారు.
Similar News
News December 28, 2025
50 మందికి పైగా దుర్మరణం.. సిగాచీ CEO అరెస్ట్

TG: సిగాచీ కంపెనీ CEO అమిత్రాజ్ను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్లో సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 50 మందికి పైగా కార్మికులు మరణించారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రి CEOను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అటు బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
News December 28, 2025
సాగు కోసం వర్షపు నీటిని కాపాడుకుందాం

వ్యవసాయానికి వాన నీరే కీలకం. ఈ నీటిని పరిరక్షించి, భూగర్భ జలాలను పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం వర్షపు నీరు నేలలో ఇంకేలా వాలుకు అడ్డంగా కాలువలు, కందకాలు తీసి నీరు వృథాగా పోకుండా చూడాలి. నీటి గుంటలు, చెక్డ్యామ్స్, ఫామ్పాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంచవచ్చు. బీడు భూముల్లో చెట్ల పెంపకం, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేలకోత తగ్గి భూసారం పెరుగుతుంది.
News December 28, 2025
CCMBలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

హైదరాబాద్లోని <


