News May 20, 2024
ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

AP: కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో కొందరు వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నుంచి వైసీపీ కార్యకర్తను ఆయన బలవంతంగా తీసుకెళ్లారనేది అభియోగం. రాచమల్లుతో పాటు ఆయన బావమరిది మునిరెడ్డిపైనా కేసు నమోదు చేశారు.
Similar News
News December 18, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) దర్యాప్తు చేయనుంది. సభ్యులుగా 9 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు <<18541312>>లొంగిపోయిన<<>> సంగతి తెలిసిందే.
News December 18, 2025
హౌసింగ్ బోర్డు LIG ఫ్లాట్ల విక్రయానికి నిర్ణయం

TG: వివిధ ప్రాంతాల్లోని 339 LIG ఫ్లాట్ల(FLAT)ను విక్రయించేందుకు హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. HYD గచ్చిబౌలిలో 111, వరంగల్లో 102, ఖమ్మంలో 126 ఫ్లాట్లను అమ్మనున్నట్లు బోర్డు VC గౌతం తెలిపారు. వాటి ధరలు గచ్చిబౌలిలో ₹26L-₹36.20L, వరంగల్లో ₹19L-₹21.50L, ఖమ్మంలో ₹11.25Lగా నిర్ణయించామన్నారు. ఆన్లైన్, మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని, వివరాలకు https://tghb.cgg.gov.inని సందర్శించాలని సూచించారు.
News December 18, 2025
చలికాలంలో గుండెపోటు ముప్పుకు ఈ టిప్స్తో చెక్!

చలితోపాటు కాలుష్యం ఎక్కువగా ఉండే తెల్లవారుజాము, అర్ధరాత్రి వేళల్లో బయటకు వెళితే గుండెపోటు ముప్పు ఎక్కువవుతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఎక్సర్సైజులు చేసుకోవాలి. ఛాతీ, మెడ, తల కవర్ చేసేలా దుస్తులు ధరించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ముఖ్యం. పొగమంచు ఎక్కువగా పడుతుంటే మాస్క్ పెట్టుకోవాలి. గాలిలో హానికర కణాల నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో ఎయిర్ప్యూరిఫయర్లు వాడాలి.


