News May 20, 2024

ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

image

AP: కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో కొందరు వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో నుంచి వైసీపీ కార్యకర్తను ఆయన బలవంతంగా తీసుకెళ్లారనేది అభియోగం. రాచమల్లుతో పాటు ఆయన బావమరిది మునిరెడ్డిపైనా కేసు నమోదు చేశారు.

Similar News

News December 3, 2025

సేమ్ రింగ్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్!

image

సమంత-రాజ్ పెళ్లి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండేళ్లపాటు రిలేషన్‌‌ను కొనసాగించిన ఈ జంట ఈ నెల 1న <<18438537>>ఒక్కటైంది<<>>. అయితే రాజ్‌తో ఫిబ్రవరిలోనే ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగిందని తెలుస్తోంది. వాలంటైన్స్ డేకు ముందు రోజు(FEB 13) పోస్ట్‌లో, తాజాగా పెళ్లి ఫొటోల్లోనూ ఒకే రింగ్ కనిపించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా వీరి రిలేషన్ గురించి పలు సందర్భాల్లో ఫొటోలతో హింట్ ఇచ్చారు.

News December 3, 2025

నాది కథను మలుపు తిప్పే రోల్: సంయుక్త

image

‘అఖండ-2’ అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని హీరోయిన్ సంయుక్త మేనన్ అన్నారు. చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుందని, కథను మలుపు తిప్పే రోల్ అని చెప్పారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు షెడ్యూల్ బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ-2 ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.

News December 3, 2025

బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

image

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.