News May 20, 2024

ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

image

AP: కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో కొందరు వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో నుంచి వైసీపీ కార్యకర్తను ఆయన బలవంతంగా తీసుకెళ్లారనేది అభియోగం. రాచమల్లుతో పాటు ఆయన బావమరిది మునిరెడ్డిపైనా కేసు నమోదు చేశారు.

Similar News

News December 13, 2025

గుమ్మం ముందు కూర్చొని ఈ పనులు చేస్తున్నారా?

image

ఇంటి గుమ్మంపై కూర్చోవడం, జుట్టు దువ్వడం, తినడం, అడుగు పెట్టడం వంటి పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే తలుపు దగ్గర ఓ కాలు లోపల, మరో కాలు బయట పెట్టి నిలబడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. గుమ్మాన్ని కూడా దైవంలా భావించాలని, పూజించాలని ఫలితంగా శుభం కలుగుతుందని వివరిస్తున్నారు. SHARE IT

News December 13, 2025

రానున్న 3 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి (D) కోహిర్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మెదక్‌ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

News December 13, 2025

మన పూర్వ జన్మ సుకృతాలేంటో తెలుసా?

image

ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!!
ఈ శ్లోకం ప్రకారం.. మన జీవితంలో వచ్చే పశువులు, భార్య, కొడుకులు, ఇల్లు.. ఇవన్నీ మన పూర్వ జన్మ సుకృతాలను బట్టి ఏర్పడుతాయి. ఇది కేవలం రుణాబంధం మాత్రమే. రుణం తీరిపోగానే వారు మనల్ని వదిలి వెళ్లిపోతారు. మన అనుకున్నవన్నీ మనకు దూరమవుతాయి. ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మంచి జరిగినా, చెడు జరిగినా మనం బాధ పడకుండా జీవించగలము.