News October 16, 2024

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

image

రబీ సీజన్ త్వరలో ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 రబీ మార్కెటింగ్ సీజన్‌లో ఆరు పంటలకు MSPని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమల ధరను రూ. 2275 నుంచి రూ. 2425, బార్లీ ధర రూ. 1850 నుంచి రూ.1980, పప్పు రూ.6425 నుంచి రూ.6700, ఆవాలు – రూ. 5650 నుంచి రూ.5950, శనగ రూ. 5440 నుంచి రూ. 5650, కుసుమలు రూ.5800 నుంచి రూ.5940కు పెంచింది.

Similar News

News January 28, 2026

ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయ్యిందా?

image

సాధారణంగా కన్సీవ్ అయినపుడు ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అవ్వగానే వైద్యులను సంప్రదించాలంటున్నారు నిపుణులు. థైరాయిడ్, షుగర్, బీపీ సమస్యలు ఉంటే వాటి ప్రభావం బిడ్డపై పడుతుంది కాబట్టి వైద్యులు పరీక్షలు చేసి మందులు సూచిస్తారు. అలాగే ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News January 28, 2026

220 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ 220 Jr. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, NAC/NTC/STC అర్హతగల వారు FEB 13 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే రూ. 21,000+IDA చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: www.ddpdoo.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 28, 2026

394 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) 394 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిప్లొమా, డిగ్రీ, ఇంటర్ అర్హత గలవారు FEB 10 వరకు NATS/NAPS పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://plapps.indianoilpipelines.inలో అప్లై చేసుకోవాలి. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iocl.com