News September 24, 2024
ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని స్నేహితుడి హత్య!

ఐఫోన్ కొన్న స్నేహితుడు పార్టీ ఇవ్వలేదని ఫ్రెండ్స్ మర్డర్ చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు సచిన్(16) ఐఫోన్ కొని స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తుండగా వారు పార్టీ అడిగారు. అందుకతడు నిరాకరించడంతో తనతో గొడవ పడ్డారు. ఈక్రమంలో సచిన్ను కత్తితో పొడిచి పరారయ్యారు. స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 28, 2025
మార్చి మూడో వారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్?

TG: పదో తరగతి పరీక్షలను మార్చి మూడో వారం నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 16 లేదా 18వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తామని ఇటీవల అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందు టెన్త్ ఎగ్జామ్స్ మొదలవడం ఆనవాయితీగా వస్తోంది.
News October 28, 2025
ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.
News October 28, 2025
అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.


