News July 25, 2024

మదనపల్లె అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు

image

AP: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే DGP నేరుగా వెళ్లి విచారణ చేశారు. తాజాగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోదియా సమీక్ష చేపట్టారు. రికార్డుల దహనంపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు, RDOలు, తహశీల్దార్లతో మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఆయన భేటీ అయ్యారు. రికార్డుల భద్రతపై ఆరా తీశారు. రెవెన్యూ ఆఫీసుల వద్ద కాపలా పెట్టాలని ఆదేశించారు.

Similar News

News January 30, 2026

విష్ణుమూర్తిని నేడు ఎలా పూజించాలంటే..?

image

వరాహ ద్వాదశి నాడు విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. రాగి/ఇత్తడి చెంబులో గంగాజలం నింపి, అక్షితలు, పువ్వులు, మామిడి ఆకులతో అలంకరించాలి. పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని సిద్ధం చేయాలి. ఈ కలశంపై వరాహ స్వామిని ప్రతిష్టించి షోడశోపచార పూజ చేయాలి. స్వామికి పసుపు వస్త్రాలు, తులసి దళాలు, బెల్లం నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. పేదలకు దానాలు చేస్తే తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

News January 30, 2026

నేడే TG EAPCET-2026 షెడ్యూల్?

image

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET(గతంలో ఎంసెట్)-2026 షెడ్యూల్‌ను JNTU ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19 లేదా 20న నోటిఫికేషన్, మార్చి తొలి వారంలో అప్లికేషన్లు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. కాగా మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

News January 30, 2026

బంగారం డిమాండ్ తగ్గుతోంది: WGC

image

బంగారం ధర ఎఫెక్ట్ డిమాండ్‌పై పడింది. వివాహాల సీజన్ అయినా కొనుగోళ్లు పెరగకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతేడాదితో పోలిస్తే ఈసారి డిమాండ్ తక్కువేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2024లో 802.8 టన్నుల అమ్మకాలు జరగ్గా 2025లో 11% తగ్గి 710.9 టన్నులకు చేరింది. ఈ ఏడాది అది 600-700 టన్నులే ఉండొచ్చని WGC అంచనా వేసింది. 2024లో కొనుగోళ్ల విలువ రూ.5.75లక్షల కోట్లు కాగా 2025లో అది రూ.7.51లక్షల కోట్లకు చేరింది.