News November 18, 2024
లా అండ్ ఆర్డర్పై మండలిలో హాట్ హాట్ చర్చ

AP శాసనమండలిలో లా అండ్ ఆర్డర్పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని ఆమె అన్నారు. దీంతో అనిత వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
Similar News
News October 21, 2025
బ్రేకప్పై రష్మిక ఏమన్నారంటే?

రిలేషన్షిప్ బ్రేకప్ అయితే అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని స్టార్ హీరోయిన్ రష్మిక అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని తాను అంగీకరించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాధను వ్యక్తపరిచేందుకు తాము గడ్డం పెంచలేమని, మందు తాగలేమని అభిప్రాయపడ్డారు. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని, బయటకు చూపించలేరని చెప్పారు. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.
News October 21, 2025
దీపావళి విషెస్ చెప్పి చనిపోయిన నటుడు

బాలీవుడ్ హాస్య దిగ్గజం గోవర్ధన్ అస్రానీ నిన్న కన్నుమూసిన <<18059366>>విషయం<<>> తెలిసిందే. మ.3 గంటలకు ఆయన చనిపోయినట్లు మేనేజర్ బాబు భాయ్ చెప్పారు. అయితే అంతకు గంట ముందే అస్రానీ తన ఇన్స్టాలో ‘హ్యాపీ దీపావళి’ అంటూ పోస్ట్ పెట్టారు. అంతలోనే తమ అభిమాన నటుడు మరణించారని తెలియడంతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 1960ల్లో సినీ ప్రయాణం ప్రారంభించిన అస్రానీ 70ల్లో స్టార్ కమెడియన్గా ఎదిగారు. ఆయనకు భార్య మంజు ఉన్నారు.
News October 21, 2025
భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం భగవద్గీతను చదవాలి.
* రోజూ ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> క్లిక్ చేయండి.