News February 21, 2025

నవీన్ పొలిశెట్టి- మణిరత్నం కాంబోలో లవ్ స్టోరీ?

image

టాలీవుడ్ జాతిరత్నం నవీన్ పొలిశెట్టి జాక్‌పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మణిరత్నం డైరెక్షన్‌లో నవీన్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరి కాంబోలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సిద్ధంకానుందని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా, మణిరత్నం చివరగా ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Similar News

News February 12, 2026

తమిళనాడులో ఇన్‌స్టాగ్రామ్ ఎలక్షన్స్!

image

తమిళనాడులో అటు నేతలు, ఇటు జెన్ జీ ఎలక్షన్స్ ఎదుర్కొంటున్నాయి. నేతలంతా ప్రజల్లో ఉంటూ ఆకట్టుకునే ప్రకటనలు, ప్రామిస్‌లు చేస్తుంటే, తాము ఆ మీటింగుల్లో ఉన్నామంటూ యువత ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ వైరల్ కావడంపై ఫోకస్ పెట్టింది. నేతలతో సెల్ఫీ, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఇన్‌స్టాలో రీల్స్ చేయడం, మిగతా వారికంటే ఎంత వేగంగా వైరల్ అవుతున్నామో చూసుకోవడంలో బిజీగా ఉంటున్నారట.

News February 12, 2026

లిక్కర్ స్కామ్‌కు రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్: సుప్రీంకోర్టు

image

AP: మద్యం కుంభకోణానికి రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారించేందుకు నిరాకరించింది. దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రాజ్ తరఫు న్యాయవాది చెప్పగా ధర్మాసనం అనుమతించింది. ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

News February 12, 2026

విదేశీ విద్యపై మోజు తగ్గుతోంది..

image

భారతీయ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై మోజు తగ్గుతోంది. అబ్రాడ్‌కు వెళ్లే వారి సంఖ్య రెండేళ్లలో 31% తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2023లో ఫారిన్‌కు 9.8L మంది వెళ్లారు. ఆ సంఖ్య 2024లో 7.7L ఉండగా 2025 నాటికి 6.26Lకు పడిపోయింది. ‘విదేశీ చదువు వారి వ్యక్తిగతం. ఆర్థిక స్తోమత, బ్యాంకు లోన్లు పొందడం, పలు దేశాలను చూడాలనుకోవడం.. ఇలా పలు అంశాలు ప్రభావితం చేస్తాయి’ అని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.