News March 18, 2024

భువనగిరి శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పట్టణ ఎస్సై సురేష్ తెలిపారు. కాలిపోయి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారని మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. కాలిపోయి ఉండటంతో ఎవరైనా హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 19, 2025

జాతీయ జల అవార్డు అందుకున్న నల్గొండ జిల్లా

image

జల్ సంజయ్ & జన్ భగీదరి కార్యక్రమంలో దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా నల్గొండ ద్వితీయ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్ రెడ్డి 6వ జాతీయ జల అవార్డు (రూ.2 కోట్ల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం)ను అందుకున్నారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

News November 19, 2025

నల్గొండ: బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

2025 -26 విద్యా సంవత్సరానికి గాను ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల నమోదు కోసం జిల్లాలోని GHS, ZPHS, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 9 10వ తరగతి చదువుతున్న అర్హులైన BC, EBC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజకుమార్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు DEC 15 లోపు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News November 18, 2025

చిత్తడి నేలల గుర్తింపు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలని అన్నారు.