News March 18, 2024
భువనగిరి శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం

భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పట్టణ ఎస్సై సురేష్ తెలిపారు. కాలిపోయి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారని మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. కాలిపోయి ఉండటంతో ఎవరైనా హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News July 10, 2025
NLG: మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
News July 10, 2025
NLG: పక్షం రోజుల్లో కమిటీల పూర్తి.. పనిచేసే వారికే ఛాన్స్

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుల నియామకం కంటే ముందే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ కమిటీలను నియమించాలని పీసీసీ నిర్ణయించింది. గ్రామాలు, మండలాల కమిటీలను నియమిస్తారు. గ్రామ, మండల స్థాయిలోనూ పార్టీ కోసం పని చేసే వారినే అధ్యక్షులుగా నియమించనున్నారు. ఈ ప్రక్రియ వచ్చే 10 -15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
News July 10, 2025
NLG: బ్లాక్లో ఆ టీకాల అమ్మకం?

జిల్లాలో ప్రస్తుత వర్షాకాలంలో జీవాలకు నీలి నాలుక, మూతి వాపు వ్యాధులు విజృంభిస్తున్నాయి. జీవాలకు టీకాలు వేసేందుకు పశు సంవర్ధక శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. పట్టించుకోవడంలేదని పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీవాలకు PPR వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. జిల్లాలో కొంతమంది పశుసంవర్ధక శాఖ సిబ్బంది 50 గొర్రెలకు రూ.వెయ్యికి ఒక బుడ్డి చొప్పున అమ్ముతున్నారని తెలిపారు.